డబ్బులు పంచుతున్న మల్లారెడ్డి?

frame డబ్బులు పంచుతున్న మల్లారెడ్డి?

Chakravarthi Kalyan
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డబ్బులు పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మంత్రి మల్లారెడ్డిని కొందరు చిన్నారులు చుట్టుముట్టారు. వినాయక చవితి చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పిల్లల మాటలు విన్న మంత్రి వెంటనే జేబులో ఉన్న 500 నోట్లు తీసి తనను చుట్టుముట్టిన పిల్లలందరికి తలో నోటు పంచేశారు.

అయితే మంత్రి ఓ కండీషన్ పెట్టారు. తానిచ్చిన డబ్బులు దేవుడికే వాడాలని, సొంతగా వాడుకోవద్దని మల్లారెడ్డి సూచించారు. సరే సరే అంటూ ఆనందపడిన పిల్లలంతా జై మల్లన్న అంటూ జై జై మల్లన్న అంటూ నినాదాలు చేశారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏం చేసినా మంత్రి మల్లారెడ్డి తనదైన స్టయిల్ చూపుతారు. మల్లారెడ్డి మాట్లాడే మాట తీరు, ఆయన ప్రవర్తన, నడవడిక డిఫరెంట్‌గా ఉంటూ ఆకట్టుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More