ఎవరి కోసం చిరంజీవి పొలిటికల్‌ డైలాగులు?

Chakravarthi Kalyan
ఇటీవల చిరంజీవి ఏపీ సర్కారుపై ఘాటుగా కామెంట్లు చేశారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై పడుతున్నారని.. ప్రజలకు మేలు చేసే పనులు చేయాలని అన్నారు. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. చిరంజీవి ఎవరికి ప్రయోజనం చేకూర్చాలనుకున్నారో చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలోలా బాలకృష్ణకు ఒక న్యాయం.. మిగిలిన వారికి ఒక న్యాయం అన్నట్లు జగన్ చేయడంలేదని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి ఏ విషయంలో అయినా వివిక్ష లేకుండా వెళుతున్నారని... సినిమాల్లో కూడా బడ్జెట్‌ లింక్‌డ్‌ టికెటింగ్‌ పెట్టారని... ఇంత పారదర్శక వ్యవస్థ పెట్టిన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ని ఇదే చిరంజీవి బాగా చేశారన్నట్లు గుర్తు ఉందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి  అన్నారు. చిరంజీవి
ఎవరి తరఫున మాట్లాడాడో కూడా తమకు అర్ధం కావడం లేదన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి .. రాజకీయాల గురించి మాట్లాడాలనుకుంటే క్లియర్‌గా మాట్లాడాల్సిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: