మోడీ సర్కారు.. 2 లక్షల ఉద్యోగాలు మాయం చేసిందా?
ప్రభుత్వ రంగ సంస్థలు ఒకప్పుడు దేశానికి గర్వకారణంగా ఉండేవన్న రాహుల్ గాంధీ.. యువత ఉద్యోగాల కలకు నెలవుగా ఉండేవని గుర్తు చేశారు. కానీ నేడు అవి ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లేనేలేవని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ సర్కార్.. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు తొలగించిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. 2014లో పీఎస్యూలలో 16.9 లక్షల ఉద్యోగాలు ఉండేవన్న రాహుల్ గాంధీ.. అవి 2022 నాటికి 14.6 లక్షలకు తగ్గాయని రాహుల్ గాంధీ అన్నారు.