ఔటర్ రింగ్ రోడ్ కు దగ్గర్లో బాచుపల్లి వద్ద హెచ్ఎండీఏ రూపొందించిన లే అవుట్ ప్లాట్లకు మంచి డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. బాచుపల్లి లే అవుట్ లో రెండో దశలో 133 ప్లాట్లను అన్ లైన్ వేలం ద్వారా విక్రయించేందుకు హెచ్ఎండీఏ వేలం ప్రక్రియను ప్రారంభించింది. ప్రీ బిడ్ సమావేశానికి విశేష ఆదరణ లభించిందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా హెచ్ఎండిఏ రూపొందించిన లేఔట్లకు ప్రజానీకం నుంచి విశేష ఆదరణ లభిస్తోందని కార్యదర్శి చంద్రయ్య తెలిపారు.
ఎం.ఎస్.టి.సి ప్రతినిధులు బాచుపల్లి లేఅవుట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆన్ లైన్ వేలం ప్రక్రియలో ఏవిధంగా పాల్గొనాలనే అంశాలను వివరించారు. ఈ ప్రి బిడ్ సమావేశానికి హెచ్ఎండిఏ సెక్రటరీ చంద్రయ్య, మల్కాజిగిరి ఆర్డిఓ మల్లయ్య, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గంగాధర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ హుస్సేన్ తో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం ఎస్ టి సి ప్రతినిధులు హాజరయ్యారు.