తెలంగాణలో టీడీపీదే రాజ్యమట.. బాలయ్య చెప్పిండు..

Chakravarthi Kalyan
తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని ఉందని...కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో పార్టీ తెలుగుదేశం పార్టీ సత్తా చూపిస్తామని నందమూరి బాలకృష్ణ అంటున్నారు.  సాంకేతికంగా విడిపోయినా ఏపీ, తెలంగాణ తేడా లేకుండా అన్నదమ్ములుగా కలిసే ఉందామని నందమూరి బాలకృష్ణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.

ఎన్టీఆర్‌ పేరు చెప్పగానే ప్రతి తెలుగు గుండె పొగరుతో నినదిస్తోందని.. సామాన్యుడి కోసం ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని బాలకృష్ణ వివరించారు. ఎందరో నాయకులకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారని.. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాలు కొనసాగించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని నందమూరి కుటుంబం, టీడీపీ, అభిమానుల తరపున డిమాండ్ చేస్తున్నానని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్‌కు కాకుండా ఇంకెవరికి భారత రత్న ఇస్తారని బాలయ్య ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: