కేసీఆర్ సరే.. మన్మోహన్ను మోదీ అవమానించలేదా?
అలాగే రైల్వే కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం బీఆర్ఎస్ ఎంపీల పేర్లు ఎక్కడా పేర్కొనలేదని అందుకే తాము వెళ్ళలేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె. కేశవరావు అన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్థలను నిర్వీర్యం చేసిందని.. ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమంలో ఇతర పార్టీ గురించి అవహేళనగా మాట్లాడడం సరికాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె. కేశవరావు అన్నారు. రూ.11,000 కోట్లు నిధుల గురించి మాత్రమే మాట్లాడితే సరిపోయేదని కేశవరావు అన్నారు.