కేసీఆర్‌ సరే.. మన్మోహన్‌ను మోదీ అవమానించలేదా?

Chakravarthi Kalyan
మొన్న ప్రధాని మోదీ తెలంగాణ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ ఆ పర్యటనలో పాల్గొనలేదు. దీన్ని బీజేపీ రాజకీయం చేసింది. దీనిపై ఇప్పుడు బీఆర్‌ఎస్‌ కౌంటర్‌ ఇస్తోంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మోదీ సీఎంగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలకు వెళ్ళలేదని ..బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె. కేశవరావు అంటున్నారు. ఒక్కసారి, రెండు సార్లు కాదు.. దాదాపు 13 సార్లు మోదీ.. మన్మోహన్‌ను అవమానించారని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె. కేశవరావు గుర్తు చేసుకున్నారు.
అలాగే రైల్వే కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం బీఆర్‌ఎస్‌ ఎంపీల పేర్లు ఎక్కడా పేర్కొనలేదని అందుకే తాము వెళ్ళలేదని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె. కేశవరావు  అన్నారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్థలను నిర్వీర్యం చేసిందని.. ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమంలో ఇతర పార్టీ గురించి అవహేళనగా మాట్లాడడం సరికాదని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కె. కేశవరావు  అన్నారు. రూ.11,000 కోట్లు నిధుల గురించి మాత్రమే మాట్లాడితే సరిపోయేదని కేశవరావు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: