ఓట్ల కోసమే.. బీజేపీ ఓబీసీ మంత్రం?
ఏప్రిల్ 1వ తేదీన అన్ని పార్టీలతో సోమజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వీహెచ్ తెలిపారు. ఇందులో రాహుల్ గాంధీ ఓబీసీలను ఎక్కడ కించ పరిచారన్నఅంశంతోపాటు ఓబీసీలకు గత ప్రభుత్వాలు ఏ చేశాయి...ఇప్పుడు గడిచిన తొమ్మిదేళ్ళగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందన్న అంశంపై కూడా చర్చిస్తామని వీహెచ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఓబీసీ విద్యార్థులు, మేధావులు
పాల్గొంటారని హనుమంతురావు పేర్కొన్నారు.