శ్రీరామనవవి.. హైదరాబాద్లో ఘనంగా శోభాయాత్ర?
ఈ యాత్ర సీతారాంబాగ్ నుంచి బోయగూడ కమాన్- మంగళహాట్ పీఎస్-పురానా పూల్-సిద్ధంబరు బజార్- గౌలిగూడ- పుత్లిబౌలి-కోఠి ఆంధ్రాబ్యాంక్-బడి చౌడి మీదుగా హనుమాన్ వ్యాయామశాలకు చేరుతుంది. శ్రీరామనవమి శోభాయాత్రకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు తరలిరావాలి. అంబర్పేట నుంచి, ఫిలింనగర్ నుంచి మరి కొన్ని శోభాయాత్రలు కోఠి వ్యాయామ శాలకు వస్తాయి. ఆకాశ్ పురి నుంచి మరో శోభాయాత్ర దూల్పేట కూడలి వద్ద కలుస్తుంది. శాంతియుతంగా ఈ శోభా యాత్ర నిర్వహిస్తారు. శోభాయాత్రకు వచ్చే భక్తులకు దారి పొడవున అన్న పానీయాలు అందుబాటులో ఉంటాయి.