ఇక తెలంగాణ కాంగ్రెస్‌లో పాదయాత్రల జోరు?

Chakravarthi Kalyan
తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రల బాట పట్టబోతున్నారు. ఏఐసీసీ పోగ్రామ్స్ కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి ఈ వివరాలు చెప్పారు. మానిక్ రావు ఠాక్రే తో పాదయాత్రలపై చర్చించామని.. 28న కోమటిరెడ్డి ,1వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2వ తేదీన భట్టి పాదయాత్రలు చేస్తారని మహేశ్వర్ రెడ్డి  తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న మహేశ్వర్ రెడ్డి .. తాను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని తెలిపారు.
 
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తోపాటు ఉత్తమ్ , భట్టి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతోపాటు నేను కూడా పాద యాత్ర చేస్తానన్న మహేశ్వర్ రెడ్డి .. నా షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తాని.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటానని.. మార్చి మొదటి వారంలో పాదయాత్ర చేయాలని ఆలోచిస్తున్నానని మహేశ్వర్ రెడ్డి  తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని.. కోమటిరెడ్డి కాంగ్రెస్ సిద్దాంతాన్ని నమ్మిన నాయకుడని.. ఇప్పటికే కోమటిరెడ్డితో మానిక్ రావు ఠాక్రే మాట్లాడారని మహేశ్వర్ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: