కేసీఆర్ సర్కారుపై నాలుగో చార్జ్ షీట్?
మంత్రి హరీష్ రావు భజన చేయడం తప్ప బడ్జెట్ వాస్తవ రూపం లేదని.. రైతు రుణమాఫీ విషయంలో కూడా కేసీఆర్ మోసం చేశారని... లక్ష రూపాయల రుణమాఫీ కావాలంటే 18 వేల కోట్లు అవసరమైతే.. బడ్జెట్ లో కేవలం 6 వేల కోట్లే కేటాయించిందని కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. విద్య, వైద్యానికి సరైన కేటాయింపులు లేవన్న కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. 18 లక్షల డబుల్ బెడ్రూం కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పుడు ఇస్తామన్న 3 లక్షలు కూడా తూతూమంత్రంగా కేటాయింపులు ఉన్నాయని.. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పిందనడానికి బడ్జెట్ నే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు.