సీమ రైతులకు జగన్ బంపర్ ఆఫర్‌..?

Chakravarthi Kalyan
రాయలసీమ రైతులకు ఇప్పుడు సీఎం జగన్ ఇచ్చిన ఆఫర్‌పై చర్చ జరుగుతోంది. రాయల సీమ రైతులు ముందుకొస్తే ఎకరానికి 30 వేల రూపాయలు చెల్లించేలా సోలార్ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుందని సీఎం జగన్ ఇటీవల అన్నారు. ప్రభుత్వమే ఈ భూములను లీజుకు తీసుకుని కంపెనీలకు ఇస్తుందని.. ఏటా 5 శాతం లీజు పెంచుతుందని.. ఈ ప్రతిపాదనలకు రైతులను ఒప్పించేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని సీఎం జగన్ పిలుపు ఇచ్చారు.
ఇటీవల నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల వద్ద రామ్ కో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించిన సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. అయితే.. ఒకే చోట 1500 ఎకరాలు, ఆపైన భూమి లభిస్తేనే.. ఈ ఒప్పందాలు జరుగుతాయి. మరి ఆ స్థాయిలో రైతులు సంఘటితం అవుతారా.. ఈ ఆఫర్‌ పై రైతులు ఎలా స్పందిస్తారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: