
కలాం మెమోరియల్ స్కూల్.. వెరీ గ్రేట్ ?
రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి లో మంచి ఉత్తీర్ణత సాధించిన 8 ప్రభుత్వ పాఠశాలలో కర్నూలు లోని డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ పాఠశాల రెండో స్థానంలో ఉంది. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ పాఠశాల అధ్యాపకురాలు విజయలక్ష్మీ ప్రశంస పత్రాన్ని తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలకు గుర్తింపు తీసుకుని వచ్చినందుకు పాఠశాలలోని ఉపాధ్యాయులకు డీఈవో సన్మానించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సహకారంతో మంచి ఫలితాలు సాధించామని విజయలక్ష్మి అంటున్నారు.