జగన్ మావయ్యా.. మా బాధలు పట్టించుకోవా?
పిల్లలకి పాఠశాలలు ఒక కిలోమీటరు దూరంలోపే ఉండాలని విద్యావిధానాలు చెబుతున్నాయి. కానీ.. ఈ నిర్ణయంతో ఏకంగా 3 కిలోమీటర్ల దూరానికి పాఠశాలలు తరలిపోయాయి. ఇది ప్రభుత్వ విద్యని పేదలకి దూరం చేయడమే అని తల్లిదండ్రులు మండిపడ్డారు. జాతీయ విద్యావిధానం, స్కూల్ రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం తమ పిల్లలను ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ కొత్త విద్యావిధానం వల్ల ప్రస్తుతం ఉన్న 42 వేల పాఠశాలలు భవిష్యత్తులో 11 వేలకి తగ్గిపోనున్నాయని విద్యావేత్తలు చెబుతున్నారు.