ఆగస్ట్ కల్లా పూర్తి కావాలి.. వాళ్లకు జగన్ డెడ్ లైన్?
వీఆర్వో, సర్వే అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ల జాయింట్ అజమాయిషీ బాధ్యతను అప్పగించాలని సీఎం జగన్ సూచించారు. గ్రామంలో సాగుచేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్ రిజిస్టర్ను వీరికి అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ సూచించారు. జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్ ఇ–క్రాప్లో లోడ్ చేయాలన్న సీఎం జగన్.. జూన్ 15 నుంచి ఇ– క్రాపింగ్ మొదలు పెట్టి ఆగస్టు చివరినాటి పూర్తిచేయాలని ఆదేశించారు. సెప్టెంబరు మొదటివారంలో సామాజిక తనిఖీ చేపట్టాలని.. జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని సీఎం జగన్ అన్నారు.