ఏపీ.. 10th పేపర్ల లీక్‌పై బొత్స షాకింగ్ కామెంట్‌?

Chakravarthi Kalyan

ఏపీలో పరీక్ష పత్రాల లీక్ పై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ స్పందించారు. పరీక్షా పత్రాలు లీక్ కాకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యార్ధులు ఆందోళనకు గురి కాకుండా పరీక్షలు రాయటంపైనే దృష్టి సారించాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ  అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని.. స్వార్ధ ప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి అరెస్టు చేశామని  విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. చిత్తూరులో ఓ ప్రైవేటు విద్యా సంస్థల సిబ్బంది సహా మాల్ ప్రాక్టిసు చేసేందుకు ప్రయత్నించిన ఏడుగురిని, మరింకొదరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారని  విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ తెలిపారు. ఆరు లక్షల మంది విద్యార్ధులకు చెందిన అంశాలపై రాజకీయాలు చేయొద్దన్న విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ.. సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని పట్టించుకోవద్దని విద్యార్ధులకు, తల్లితండ్రులకు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: