కాంగ్రెస్ : రేవంతోరు మ‌ళ్లీ అరెస్ట్‌..అక్క‌డ టెన్ష‌న్‌..!

N ANJANEYULU
తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు మ‌రొక‌మారు నిర్బంధించారు. ఇవాళ శుక్ర‌వారం భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో శాయంపేట‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టారు. ఈ త‌రుణంలో కార్య‌క్ర‌మానికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్న రేవంత్‌రెడ్డిని పోలీసులు అక‌స్మాత్తుగా హౌస్ అరెస్ట్ చేసారు. ఉద‌యం ఆయ‌న ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్న పోలీస్ బ‌లాలు రేవంత్ బ‌య‌ట‌కీ రాకుండానే అడ్డుకున్నారు.
ఈ స‌మ‌యంలో అక్క‌డ ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుండానే బారీ బందోబ‌స్తు ఏర్పాటు చేసారు.  ఇటీవ‌ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ద‌త్త‌త గ్రామ‌మైన ఎర్ర‌వెల్లిలో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు సిద్ధ‌మైన రేవంత్‌ను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేసిన సంతి విధిత‌మే. ఈ విష‌యం తెలిసిన కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో రేవంత్ నివాసానికి చేరుకున్నారు. ఈ త‌రుణంలో పోలీసుల‌ను నెట్టుకుంటూ.. బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఆయ‌న య‌త్నించ‌డంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకున్న‌ది. దీంతో పోలీసులు రేవంత్‌రెడ్డిని చివ‌రికీ అరెస్ట్ చేయాల్సి వ‌చ్చింద‌ని వివ‌రించారు. తాజాగా శాయంపేట‌లో ర‌చ్చ‌బండ‌కు బ‌య‌లుదేరిన రేవంత్‌రెడ్డినీ మ‌రొక‌సారి హౌస్ అరెస్ట్ చేయ‌డంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిప‌డుతూ ఉన్నారు.  ముఖ్యంగా రేవంత్ తాజా అరెస్ట్ తో ఆయ‌న ఇంటి వ‌ద్ద టెన్ష‌న్ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: