దారుణం: క్రూరంగా 18 ఏళ్ల బాలికపై వ్యక్తి దాడి.. ఎక్కడంటే..?
ఇది ఇలా ఉండగా నిందితుడు మోహిత్ కుమార్పై ఐపీసీ సెక్షన్ 354, సెక్షన్ 323, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్హెచ్ఓ మాట్లాడారు. నిషా అహ్మద్ డిసెంబర్ 19న తాను కొనుగోలు చేసిన బ్యాడ్మింటన్ రాకెట్లో కొన్ని తీగలు విరిగిపోయినట్టు గుర్తించారు. ఆ తరువాత దానిని మార్చుకోవడానికి ఖతిమా రోడ్డులో ఉన్న ఒక దుకాణానికి వెళ్లినది. కానీ ఆమె అతన్ని అంకుల్ అని పిలవడంతో దుకాణదారుడు కోపం తెచ్చుకున్నాడు. ఆమెను దారుణంగా చితకబాదాడు. నిషా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. జోక్యం చేసుకున్నారు. మరోవైపు నిషా తండ్రి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసారు.