దారుణం: క్రూరంగా 18 ఏళ్ల బాలికపై వ్యక్తి దాడి.. ఎక్క‌డంటే..?

N ANJANEYULU
మ‌హిళ‌ల ప‌ట్ల గౌర‌వం క‌న‌బ‌ర్చాల్సిన పురుషులు కొంద‌రు చిన్న విష‌యానికి కోపోద్రిక్తులై దాడుల‌కు య‌త్నిస్తున్నారు. ఇలా దేశ‌వ్యాప్తంగా ఏదో ఒక చోట చోటు చేసుకూనే ఉంటున్నాయి.  ఉత్త‌ర‌ఖాండ్ లో ఉధ‌మ్‌సింగ్ న‌గ‌ర్‌లో జిల్లాలో దారుణ‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. సితార్‌గంజ్ ప‌ట్ట‌ణ ప‌రిధిలోని ఓ ప్రాంతంలో 35 ఏండ్ల దుకాణం దారుడిని అంకుల్ అని పిలిచినందుకు 18 ఏళ్ల బాలిక‌పై దాడికి య‌త్నించాడు. అంతేకాకుండా ఆమెను దారుణంగా కొట్టాడు ఆ వ్యక్తి. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌లో నిషా అహ్మ‌ద్ బాధితురాలు గా గుర్తించారు. ఆ దాడిలో 18 ఏళ్ల బాలిక‌కు త‌ల‌పై బ‌ల‌మైన గాయాలు కావ‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.
ఇది ఇలా ఉండ‌గా నిందితుడు  మోహిత్ కుమార్‌పై ఐపీసీ సెక్ష‌న్ 354, సెక్ష‌న్ 323, సెక్ష‌న్ 506 కింద కేసు న‌మోదు చేసారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించి ఎస్‌హెచ్ఓ మాట్లాడారు. నిషా అహ్మ‌ద్ డిసెంబ‌ర్ 19న తాను కొనుగోలు చేసిన  బ్యాడ్మింట‌న్ రాకెట్‌లో కొన్ని తీగ‌లు విరిగిపోయిన‌ట్టు గుర్తించారు. ఆ త‌రువాత దానిని మార్చుకోవ‌డానికి ఖ‌తిమా రోడ్డులో ఉన్న ఒక దుకాణానికి వెళ్లిన‌ది. కానీ ఆమె అత‌న్ని అంకుల్ అని పిల‌వ‌డంతో దుకాణ‌దారుడు కోపం తెచ్చుకున్నాడు. ఆమెను దారుణంగా చిత‌క‌బాదాడు. నిషా చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌రలించారు పోలీసులు. ఈ విష‌యంపై పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో.. జోక్యం చేసుకున్నారు. మ‌రోవైపు నిషా తండ్రి కూడా పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: