ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమావేశం
కమిషన్ సిఫారసులను పరిశీలించి ఎంత మేరకు వేతనాలు పెంచాలని అంశంపై నిపుణులతో క్లారిటీ తీసుకోనున్నారు సీఎం. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి మిగిలిన సమస్యలపై కూడా చర్చిస్తున్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ తదితర డిమాండ్లపై కూడా చర్చలు జరుపుతున్న సీఎం జగన్. ఇదిలా ఉండగా.. డిసెంబర్ 3న తిరుపతిలో సీఎం జగన్ పది రోజుల్లోనే పీఆర్సీ ప్రకటిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం జరిగే సమావేశంలో ట్ మెంట్ ను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. గ్రామ వార్డ్ సచివాలయాల ఉద్యోగులకు ప్రొహిబిషన్ ఖరారు అంశంపై కూడా చర్చలు జరుపనున్నారు సీఎం జగన్.