నేటి నుంచి రెండో ‘టెస్ట్’ గెలిచిన జట్టుకే సిరీస్
భారత్ తుదిజట్టు ఎలా ఉండనున్నదని ఆసక్తికరంగా నెలకొన్నది. విరాట్ కోహ్లీ ఎవరి స్థానంలో జట్టులోకి వస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుజారా లేదా రహానేలలో ఎవరో ఒకరూ దూరమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండో టెస్ట్కు స్పిన్ పిచ్ను తయారు చేసినట్టు తెలుస్తోంది. నిర్ణయాత్మక రెండవ టెస్ట్లో ఫలితం రావాలనే ఉద్దేశంతో స్పిన్ పిచ్ రూపొందించినట్టు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. భారత గడ్డపై స్పిన్ను ప్రధాన అస్త్రంగా టీమిండియా భావిస్తున్న తరుణంలో వాంఖడే పిచ్ ను దీనికి అనుగుణంగానే తయారు చేసాం అని ముంబై క్రికెట్ సంఘం వర్గాలు వెల్లడించాయి.