భద్రత బలగాలే నా కుటుంబం : ప్రధాని మోడీ
2014 నుంచి ప్రతి ఏడాది సైనికులతో దీపావళి జరుపుకుంటున్నట్టు తెలిపారు. సైనికుల వల్లనే భారతదేశం ప్రశాంతంగా ఉంది. నౌషీరా కబ్జాకు గతంలో శత్రువు ప్రయత్నించాడు. ఆ శత్రువుకు మన బలగాలు గట్టి సమాధానం చెప్పాయి. నౌషీరా పవిత్ర భూమి అని ప్రధాని వెల్లడించారు. శత్రువుల వేటలో అశువులు బాసిన సైనికులకు నా సెల్యూట్ అని ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశ రక్షణలో ముందున్నారు. యావత్ దేశం మీ సేవలను చూసి గర్విస్తోంది.