మచిలీప‌ట్నం ఆస్ప‌త్రిలో ఆడ‌శిశువు మాయం..చుట్ట‌మ‌ని వ‌చ్చి!

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరు రోజుల శిశువు అదృశ్యం కలకలం రేపుతోంది. పామర్రు మండలం పెద్దమద్దాలి గ్రామానికి సొంగా ఇందుజ అనే యువ‌తి ఆరు రోజుల క్రితం ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా నిన్నటి రోజున గుర్తు తెలియని ఓ మహిళ నేను నీ భర్తకు దగ్గర చుట్టమని, నేను ఏడు నెలల గర్భిణీ అని స్కానింగ్ కోసం వచ్చినట్టు చెప్పి న‌మ్మించింది. ఆ మాట ఈ మాట చెప్పి రాత్రి ఇందుజ‌ వద్దే పడుకుంది.

ఇక ఈ రోజు ఉదయం ఇందుజ డిశ్చార్జ్ కొరకు ఫారం ఫిల్ చేసేందుకు వెళ్లగా బంధువైనటువంటి ఆ మహిళ శిశువును ఎత్తుకుని పరారవ్వ‌డంతో ఇందుజ షాక్ అయ్యింది. దాంతో ఇందూజ తన బిడ్డ కోసం  కన్నీరుమున్నీరయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా శిశువును అపహరించిన మహిళ కోసం గాలింపు చర్యలు ఇప్ప‌టికే ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: