గోల్డ్ కపుల్..కూలీలే టార్గెట్, ఏకంగా పదకొండు హత్యలు!
ఇప్పటివరకు ఎనిమిది హత్యలు చేసినట్లు భర్త ఒప్పుకోగా, పదకొండు హత్యలు చేసినట్లు భార్య ఒప్పుకుంది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేస్తున్నారు. ఒక మిస్సింగ్ ఫిర్యాదుతో ఈ ఘరానా దంపతులు దొరికినట్టు చెబుతున్నారు. కూలీ పని ఇప్పిస్తామని నమ్మబలుకుతూ హత్యలు చేస్తున్నట్టు పోలీసుల వద్ద వీరు ఒప్పుకున్నారని అంటున్నారు. సంగారెడ్డి జిన్నారం అడవుల్లోకి తీసుకెళ్లి హత్య చేసి బంగారం దోపిడీ చేస్తున్నట్లు గుర్తించారు.