మహంకాళి ఆలయానికి కేసీఆర్..!

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
సీఎం కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇవాళ సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సికింద్రాబాద్‌ లో ఈ ఉదయం 4 గంటలకే లష్కర్‌ బోనాలు ప్రారంభమయ్యాయి. ఈ లస్కర్ బోనాలకు హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్.. ప్రభుత్వం తరఫున తొలి బోనం సమర్పించారు.

లస్కర్ బోనాలు కావడంతో వేకువజాము నుంచే సికింద్రాబాద్ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు బోనమెత్తి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బోనాల పండుగ వేళ ఆదివారం జంట నగరాల్లో సందడి కనిపిస్తోంది. ఈ బోనాలను జంట నగరాల్లోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆది వారం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. లస్కర్ బోనాల వేళ జంట నగరాల్లో  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.. భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: