ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయని ఆమె ఆరోపించారుర. ఆరువందల హామీలిచ్చిన టీడీపీ వాటిని అమలు చేసుంటే ప్రజలు ఇలాంటి తీర్పు ఇచ్చేవారు కాదన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేసేముందు చేసుకోవాలన్నారు. ప్రతికారం తీర్చుకుంటామని టీడీపీ నేతలు పదేపదే చెప్తున్నారని...ప్రతికారం అంటే ఒక హత్యకు పదిహత్యలు చేయడమా అని ఆమె ప్రశ్నించారు.చిత్తశుద్ధితో అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం జాబ్ క్యాలెండర్ ఇచ్చారని..ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు.
అయితే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతలపై హత్యలు జరిగాయనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేసే వారిని టార్గెట్ చేస్తున్నారంటూ టీడీపీ ఆరోపింస్తుంది. నిన్న కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన జంట హత్యల కేసుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్గా తీసుకన్నారు.హత్యల వెనుక ఉన్న వైసీపీ నాయకుల పేర్లను ఆయన బయటంపెట్టారు.
మరింత సమాచారం తెలుసుకోండి: