బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాల సిఎంలు భేటీ...? అజెండా అదే...?

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీటి సమస్యతో పాటుగా ఎన్నో సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటినుంచో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకు మధ్య ఒక రకంగా యుద్ధం నడిచింది. అయితే జగన్ వచ్చిన తర్వాత అవి పరిష్కారం కాకపోగా అలాగే కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా ప్రగతిభవన్ లో ఉన్నతాధికారుల సమక్షంలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని మీడియా వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి జలవనరుల శాఖ అధికారులు అదే విధంగా హోం మంత్రిత్వ శాఖ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసిందని త్వరలోనే వీరు భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఇద్దరూ భేటీ కావచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: