తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు.ముమ్మిడివరం పట్టణంలో బర్త్డే వేడుకలు పేరుతో వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు వీరంగం సృష్టించారు. అర్థరాత్రి వందల మంది కత్తులతో ర్యాలీలు చేస్తూ హల్చల్ చేశారు.ఊరంతా తిరుగుతూ అరుపులు కేకలతో కత్తులు చేతపట్టి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ ఎదుటే కేక్ కట్ చేశారు. ఇదంతా జరుగుతున్న పోలీసులు మాత్రం మౌనంగా ఉన్నారు.ముమ్మిడివరం నగర పంచాయతి ఐదో వార్డుకు చెందిన వైసీపీ మాజీ కౌన్సిలర్ కొడుకు దుర్గాప్రసాద్ అలియాస్ చంటి పుట్టిన రోజు కావడంతో పోలీసులు కూడా సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఓ పక్క కరోనా విజృంభిస్తున్నా నిబంధనలు ఉల్లంఘించి మరీ కార్లు,బైక్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కొందరు మాజీ రౌడి షీటర్లు కూడా పొడవాటి కత్తులు..తల్వార్లు చేతబట్టుకుని ఊరంతా అరుపులు కేకలతో రెచ్చిపోయారు.దీంతో ఒక్కసారిగా పట్టణంలోని ప్రజలు భయభ్రాంతులకు గురైయ్యారు.