మాన్సాస్ ట్రస్ట్ పై ప్రభుత్వం తెచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేయడాన్ని స్వాగితిస్తున్నామని మాజీ మంత్రి నారా లోకేస్ తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్ని చెరబట్టేందుకు వైసీపీ ప్రభుత్వం అర్థరాత్రి చీకటి జీవోలను తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ జీవోలని హైకోర్టు కోట్టేయడంతో ధర్మం,చట్టం,న్యాయానిదే అంతిమ విజయమని తెలిందన్నారు.ఈ తీర్పు అప్రజాస్వామికంగా,రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న జగన్ రెడ్డి సర్కార్కి చెంపపెట్టని పేర్కొన్నారు.భూములు, వేల కోట్ల ఆస్తులు ప్రజల కోసం దానమిచ్చిన పూసపాటి వంశీకుల దానగుణానికి, సత్యనిష్టకి న్యాయస్థానం తీర్పు మరింత వన్నెతెచ్చిందని కొనియాడారు. అరాచక పాలనపై రాజ్యాంగం సాధించిన విజయమని..మాన్సాస్ ట్రస్ట్పై న్యాయపోరాటం చేసి సాధించుకున్న కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.మాన్సాస్ ట్రస్ట్ వివాదం చాలా రోజులుగా కొనసాగుతూ వచ్చింది.తాజగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వివాదం దాదాపుగా సర్ధుమణిగినట్లు కనిపిస్తుంది.కానీ హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి