భారత క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారి పురుషులు, మహిళల క్రికెట్ జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకే చార్టర్డ్ విమానంలో కలిసి ఇంగ్లాండ్కు ప్రయాణించనున్నారు. భారత బృందం జూన్ 2న ముంబై నుంచి బయల్దేరనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది. మరోవైపు వచ్చే నెలలో మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత మహిళల క్రికెట్ టీమ్ కూడా ఇంగ్లాండ్ టూర్కు వెళ్లనుంది.