ప్రముఖ న‌టి సోద‌రుడు కరోనాతో కన్నుమూత..!!

Madhuri
కరోనా మహమ్మారితో తెలుగు సినిమా రంగానికి చెందిన మరో సినీ ప్రముఖుడు కన్నుమూశాడు. ప్రముఖ ఎడిటర్, సీనియర్ నటి ప్రభ సోదరుడు NGV ప్రసాద్ కరోనాతో కన్నుమూసారు. కొన్ని రోజుల కింద కరోనా బారిన పడిన ఈయన.. చికిత్స పొందుతూ చెన్నై వెంకటేశ్వర ఆస్పత్రిలో మరణించారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ప్రసాద్.. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఈయన పలు తెలుగు-తమిళ చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసారు. తెలుగులో లెజెండరీ దర్శకుడు కోదండరామి రెడ్డితో ఎక్కువ సినిమాలకు పని చేసారు. తన అన్నయ్య ఆకస్మిక మరణం తట్టుకోలేకపోతున్నానని.. ఆయన మరణవార్త జీర్ణించుకోడానికి చాలా సమయం పడుతుందని కంటతడిపెట్టుకుని విలపించింది ప్రభ. కాగా ప్రసాద్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: