ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తారు...?

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రబ్భుత్వంపై మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లో ఓట్లు అడుగుతారు అని ఆయన నిలదీశారు. ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల్లోకి ఏ విధంగా వస్తారు అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం ఆరు లక్షల ఇళ్ళల్లో కి నీళ్ళు వచ్చాయని అన్నారు. రాజ్ భవన్ ముందు నీళ్ళు ఆగకుండా చేసారా అని నిలదీశారు.
ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజల్లోకి వస్తున్న తెరాస నేతలను నిలదీయాలని ఆయన సూచించారు. హైదరాబ్బాద్ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే బిజెపి అండగా ఉంటుంది అని ఆయన హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను అసలు హైదరాబాద్ లో కట్టలేదని ఆయన అన్నారు.  రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: