కేసీఆర్ చరిత్ర తిరగరాసి.. ఎదురు డబ్బులిచ్చారు !

దుబ్బాక ఉప ఎన్నికల్లో హరీష్ రావు స్పీడ్ పెంచారు. ఈరోజు ఆయన తొగుట మండలం ఘానాపూర్ లో మంత్రి హరీష్ రావు ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడైనా ఉచిత కరెంట్ ఇచ్చారా..? అని అయన ప్రశ్నించారు. గతంలో ఓట్ల కోసం లీడర్లు వస్తే బిందెలు పెట్టి నీటి కోసం మహిళలు ప్రశ్నించేవారని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడైనా ఉందా ? అని ఆయన ప్రశ్నించారు.
 నిజాం పాలన నుండి సమైక్యాంధ్ర పాలన వరకు ప్రతి ఒక్కరు భూమి ఉన్న వారి వద్ద శిస్తు వసూలు చేశారని ఒక్క కేసీఆర్ మాత్రం చరిత్ర తిరగరాసి భూమి ఉన్న ప్రతి వారికి రైతుబంధు పథకం ద్వారా డబ్బులు ఇచ్చారని అన్నారు. బీజీపీ నాయకులు విదేశీ మక్కలు తెచ్చి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నారని హరీష్ రావు అన్నారు. బీజేపీ వారికి ప్రజలు ఓటు ద్వారా బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత జిల్లా మంత్రిగా నాదని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: