ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో వివిధ మావోయిస్టు గ్రూపులకు చెందిన 32 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా స్థానిక గ్రామాలకు చెందిన వారే.లొంగిపోయిన వారంతా పోలీసులపై దాడులు చేయడం, మందుపాత్రలు పేల్చడం వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన రివార్డు మొత్తాన్ని అందచేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాలతో వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు.
ఇప్పటికే దంతెవాడ పోలీసులు నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లతో మావోయిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.జూన్ నుంచి ఇప్పటివరకు 150 మంది జనజీవన స్రవంతిలో కలిసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: