ఎట్టకేలకు హైదరాబాద్ వస్తున్న కేంద్రం...!
అయితే తాజాగా కేంద్రం తన బృందాన్ని హైదరాబాద్ కు పంపించే అవకాశం ఉంది. రేపు సాయంత్రం హైదరాబాద్ కు రానున్న కేంద్ర బృందం హైదరాబాద్ లో పర్యటిస్తుంది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సెంట్రల్ టీం... వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. కీలక అధికారుల బృందం హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.