ఏపీ డీజీపీ కోసం ఏకంగా సుప్రీం కోర్ట్ కి వెళ్ళారు...!

ఆంధ్రప్రదేశ్ లో డీజీపీ టార్గెట్ గా కొంత మంది విపక్షాల నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పోలీసులు చేసే  చిన్న చిన్న తప్పులకు కూడా ఆయననే టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం గమనార్హం. ఇక హైకోర్ట్ లో ఆయనపై పలు మార్లు  పిటీషన్ లు కూడా దాఖలు అయిన సంగతి తెలిసిందే. ఏపీ డీజీపీ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి.
 ఏపీ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు అడ్వకేట్ కోటేశ్వర రావు.  పోలీస్ శాఖ ను  కించపరిచే విధంగా హైకోర్టులో వ్యాఖ్యానించడం తగదని పిటిషన్ వేసారు.  హైకోర్టు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కిందిస్థాయి సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఫిర్యాదు చేసారు. కోటేశ్వరావు పిటిషన్ ను పీల్ గా స్వీకరించింది సుప్రీంకోర్టు.  తదుపరి విచారణ కొరకు వాయిదా వేసింది సుప్రీం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: