బ్రేకింగ్:అలిపిరి కరోనా టెస్టింగ్ పాయింట్ లో కరోనా...!

అలిపిరి కరోనా టెస్టింగ్ సెంటర్ లో ఇద్దరికీ కరోనా సోకడంతో అధికారులు అక్కడ పరీక్షలను నిలిపివేశారు. ఒక టెక్నీషియన్ కు ఒక డాక్టర్ కు కరోనా సోకడంతో అధికారులు కరోనా టెస్ట్ లను నిలిపివేశారు. తాత్కాలికంగా మూసి వేస్తున్నామని పేర్కొన్నారు అధికారులు.  ఇప్పటి వరకు భక్తులకు ఉద్యోగులకు ఇక్కడే కరోనా పరిక్షలు చేసారు అధికారులు. 

 

కాని అనూహ్యంగా అందులో ఉండే కీలక వ్యక్తులకు కరోనా రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఇప్పుడు కరోనా పరిక్షలు ఎక్కడ చేస్తారని ప్రశ్నిస్తున్నారు భక్తులు. అయితే ఇప్పటి వరకు భక్తులకు ఎవరికి కరోనా రాలేదు. కేవలం అధికారులకు, ఉద్యోగులకు మాత్రమే కరోనా వస్తుంది. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: