ఏపీలో ఆందోళనకరంగా కరోనా మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఏమో గాని మరణాల సంఖ్య పెరగడమే ఇప్పుడు రాష్ట్ర వాసులను బాగా భయపెడుతున్న అంశం. ఒక పక్క కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. మరో పక్క ప్రతీ రోజు కూడా మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా వ్యవహరించినా సరే కేసులు భారీగానే పెరుగుతున్నాయి.
నిన్న ఒక్క రోజే దాదాపుగా 2 వేల కేసులు రాష్ట్రంలో నమోదు అయ్యాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరణాల మీద ఇప్పుడు సిఎం జగన్ కూడా ఆందోళనలో ఉన్నారు. ప్రతీ రోజు 15 మందికి పైగా మరణించడం ఇప్పుడు భయపెడుతుంది. కేంద్రం కూడా ఇప్పుడు ఏపీ మరణాల మీద దృష్టి పెడుతుంది.