పెద్ద, చిట్టీ నాయుళ్లు గుండెలు బాదుకుంటున్నారు: విజయసాయి
ఇటీవల టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కి సంస్థ అయిన అమర్ రాజా గ్రూప్ కి సంబంధించిన 253 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దీనిపై తనదైన శైలిలో స్పందించారు. 253 ఎకరాలు భూమి గల్లా వారికి ఇచ్చి పదేళ్లైనా అమరరాజా ఇన్ఫ్రా దాన్ని నిబంధన ప్రకారం రెండేళ్లలోగా ఫ్యాక్టరీ పెట్టి 20వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఆయన ట్వీట్ చేసారు.
కాని అవేమీ జరగక భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ స్పందించడాన్ని ఆయన తప్పుబట్టారు. పెద్ద, చిట్టీ నాయుళ్లు గుండెలు బాదుకుంటున్నారన్నారు. నిబంధనలు అమలుచేస్తే కక్ష సాధింపట అని ట్వీట్ చేసారు.
253 ఎకరాలు భూమి గల్లా వారికి ఇచ్చి పదేళ్లైనా అమరరాజా ఇన్ఫ్రా దాన్ని నిబంధన ప్రకారం రెండేళ్లలోగా factory పెట్టి 20వేల మందికి ఉద్యోగాలు కల్పించాలి. అవేమీ జరగక భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పెద్ద, చిట్టీ నాయుళ్లు గుండెలు బాదుకుంటున్నారు. నిబంధనలు అమలుచేస్తే కక్ష సాధింపట. — Vijayasai reddy v (@VSReddy_MP) July 2, 2020