తమిళనాడులో ఒక్క రోజే నాలుగు వేల కేసులు

తమిళనాడులో కరోనా చుక్కలు చూపిస్తుంది. అక్కడ ప్రతీ రోజు కూడా వేల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి వేల కేసులు నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో తమిళనాడులో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి అని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

 

తమిళనాడులో 3,940 కొత్త కరోనా పాజిటివ్ కేసులు మరియు 54 మరణాలు నమోదయ్యాయని తెలిపింది. 45,537 మంది కరోనా కారణంగా కోలుకున్నారని వెల్లడించింది. మొత్తం 35,656 యాక్టివ్ కేసులు ఉన్నాయి అని వివరించింది. 1,079 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు అని పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 82,275 గా ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: