ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ పెంపు: సిఎం
ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపధ్యంలో ఇప్పుడు ప్రభుత్వాలు ముందే జాగ్రత్త పడుతున్నాయి. కేంద్ర సర్కార్ తో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఈ నేపధ్యంలోనే ఒక రాష్ట్రం కరోనా పరిక్షల సంఖ్యను పెంచడమే కాకుండా లాక్ డౌన్ ని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుండి 15 వరకు మణిపూర్లో లాక్ డౌన్ను మరో 15 రోజులు పొడిగించాలని నిర్ణయించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.