టీడీపీ గుస‌గుస‌: పార్టీ మారే ఆలోచనలో గల్లా...?

VUYYURU SUBHASH

ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే రాజకీయ సంచలనం చోటు చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయన పార్టీ మారే విషయమై ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి సమాచారం ఇచ్చారు అని ఆయన పార్టీ మారడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. కొద్ది రోజులుగా పార్టీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు అని తెలుస్తుంది. 

 

త్వరలోనే పార్టీ నుంచి మరి కొందరు నేతలు వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది. గల్లా ఇప్పుడు ఢిల్లీ లోనే ఎక్కువగా ఉంటున్నారు అని పరిశీలకులు అంటున్నారు. చూడాలి ఆయన ఎప్పుడు పార్టీ మారే అవకాశం ఉంది అనేది. ప్ర‌స్తుతం ఈ విష‌యం గుంటూరు న‌గ‌రంలో ఎక్కువుగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. 
విచిత్రం ఏంటంటే టీడీపీ వ‌ర్గాల్లోనే దీనిపై ఎక్కువ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయని వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: