బ్రేకింగ్:గోరుముద్దకు ఎంత ఖర్చు చేసారో చెప్పిన గవర్నర్...!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. వివిధ పథకాల ద్వారా 3.98 కోట్ల మందికి లబ్ది చేకూర్చామని అన్నారు. గోరు ముద్ద పథకం ద్వారా 1105 కోట్లు ఖర్చు చేసామని గవర్నర్ అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా 6.5 లక్షల మందికి వైద్యం అందించినట్టు చెప్పారు ఆయన. 

 

మేనిఫెస్టో లో లేని 40 హామీలను అమలు చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8 శాతం వృద్ధి  సాధించామని అన్నారు. మూడేళ్ళ లో 48 వేల స్కూల్స్ ని ఆధునీకరించాలి అని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పారు. ప్రతీ గ్రామంలో వైఎస్సార్ క్లీనిక్స్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు గవర్నర్. నాడు నేడు కింద స్కూల్స్ ని అభివృద్ధి చేస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: