కూరగాయలను తొక్కించిన పోలీస్ పై ప్రభుత్వం కఠిన చర్యలు

కొన్ని చోట్ల లాక్ డౌన్ ని కట్టడి చేసే విషయంలో పోలీసులు కాస్త అతి చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పోలీసులు చాలా వరకు సౌమ్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు జాగ్రత్తలు చెప్తున్నా సరే మరి కొందరు మాత్రం చెలరేగిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఒక పోలీస్ అధికారి అయితే తీవ్ర స్థాయిలో రెచ్చిపోయాడు. పోలీసు వాహనంతో కూరగాయల మార్కెట్ ని ధ్వంశం చేసాడు. 

 

ప్రస్తుతానికి అతడిని సస్పెండ్ చేసింది. అలాగే మరో చోటకి బదిలీ కూడా చేసింది. ప్రయాగ్‌రాజ్‌లోని ఓ మార్కెట్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగి౦ది. వేగంగా వస్తూ కూరగాయలను నాశనం చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: