ఫర్నీచరం రంగంలో అగ్రగామిగా నిలిచిన నీల్ కమల్ ఇప్పుడు కరోనా బాధితుల కోసం ఓ స్పెషల్ క్వారంటైన్ బెడ్, ఐసొలేషన్ బెండ్, వైరస్ గార్డ్, ట్రావెల్ గార్డ్ తయారు చేసింది. గత రెండు నెలల నుంచి దేశంలో కరోనా ఏ రేంజ్ లో విస్తరిస్తుందోఅందరికీ తెలిసిందే. అయితే కరోనా వైరస్ ఉన్నవారిని క్వారంటైన్ కి పుంపుతున్నారు. అక్కడ కొంత మందికి సరైన వసతులు లేవంటూ నానా యాగీ చేస్తున్నారు. ప్రభుత్వం సైతం ప్రైవేట్ ఆసుపత్రులు, ఇతర విశాలమైన ప్రదేశాల్లో క్వారంటైన్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే కరోనా వచ్చినప్పటి నుంచి దాని భారి నుంచి తప్పించుకునేందుు అవసరం అన్వేషణకు దారి తీస్తుంది. కరోనా వైరస్ వల్ల కొత్త కొత్త పరికరాలను కనిపెడుతున్నాయి. కరోనాను గుర్తించగానే వెలిగే ఫ్లోరోసెంట్ మాస్కులు, నిత్యావసర సామగ్రిపై కరోనా వైరస్ను చంపే ఆల్ట్రావయొలెట్ డబ్బాలు ఎన్నో తయారవుతున్నాయి.
ఈ నేపథ్యంలో క్వారంటైన్ బెడ్, ఐసొలేషన్ బెండ్, వైరస్ గార్డ్, ట్రావెల్ గార్డ్ లనున తయారు చేశామని, ఇవి అటు పేషంట్లకు, ఇటు వైద్యసిబ్బంది యూజర్ ప్రెండ్లీగా ఉంటాయని తెలిపింది. మంచాన్ని కేవలం మూడే నిమిషాల్లో ‘కరోనా మంచం’ వాడుకునే వీలుందన్నారు. చేతులు కడుక్కోడానికి కూడా ప్రత్యేక పరికరం తయారు చేశామన్నారు. అంతే కాదు భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక కుర్చీలను కూడా రూపొందించామన్నారు. ముంబై మునిసిపల్ ఆస్పత్రుల కోసం వెయ్యి మంచాలను, ఇతర ఫర్నీచర్ను సరఫరా చేశామని వెల్లడించారు.