పాక్ జర్నలిస్ట్కు నగ్మా సపోర్ట్.. నెటిజన్లు ఊరుకుంటారా..?
అందాల సినీ తార, రాజకీయ నాయకురాలు నగ్మా వివాదంలో చిక్కుకున్నారు. భారత్పై విషం కక్కుతూ మాట్లాడిన పాకిస్తాన్ జర్నలిస్టుకు మద్దతు పలుకుతూ నగ్మ మాట్లాడటంతో ఆమెపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అసలేం జరిగిందో చూద్దాం.. బుధవారం ఓ హిందీ టీవీ ఛానల్ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చా కార్యక్రమం ప్రారంభించింది. ఇందులో నగ్మాతోపాటు తరీఖ్ పీర్జాదా అనే పాకిస్తాన్ జర్నలిస్ట్ కూడా పాల్గొన్నారు. ఈ చర్చలో పాక్ జర్నలిస్ట్.. భారత్ఫై విషం కక్కుతూ తన మాతృ దేశాన్ని పొగిడారు. దీంతో ఛానల్ ప్రతినిధి అతనిపై తీవ్రంగా మండిపడ్డారు. అలా మాట్లాడటం సరికాదని ఆయన విమర్శించారు.
అయితే..నగ్మా మాట్లాడిన తీరుతో అందరూ విస్తుపోయారు. నగ్మ పాక్ జర్నలిస్ట్ను అడ్డుకోవాల్సిందిపోయి యాంకర్పైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కించపరిచేందుకే డిబేట్కు ఆహ్వానించారా? అని ఆమె మండిపడ్డారు. అనంతరం ట్విటర్లోనూ పాక్ జర్నలిస్టుకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నగ్మ. భారత్పై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పాక్ జర్నలిస్టుకు మద్దతివ్వడం ఏమిటంటూ నెటిజన్లు నగ్మాని నిలదీస్తున్నారు. ఇలాంటి చర్యలతో ఆమె తన గౌరవాన్ని పోగొట్టుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు.ఇక పనిలోపనిగా.. ఆమె కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శలతో ముంచెత్తారు.