బ్రేకింగ్; జగన్ అత్యవసర సమావేశ౦...!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరగడం రోజు కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా సరే కేసులు మాత్రం కట్టడి కావడం లేదు. దీనిపై ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. 

 

ఈ నేపధ్యంలో ఏపీ సిఎం జగన్... అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కరోనా నియంత్రణ పై ఆయన చర్చిస్తారు అధికారులతో. ఈ సమావేశానికి... వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి జవహర్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. రెడ్ జోన్స్ గా ఉన్న జిల్లాలపై సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశానికి మంత్రులు, బొత్స, ఆళ్ళ నానీ, డీజీపీ సహా పలువురు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: