ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంతో పాటు అందం మీద కూడా శ్రద్ద అనేది పెరిగింది. మనలో ప్రతి ఒక్కరూ కూడా అందమైన, కాంతివంతమైన ముఖం కావాలని ఎంతగానో కోరుకుంటారు.అందుకోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి ఎన్నో వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మన ఇంటిలో ఉండే కొన్ని సహజసిద్దమైన పదార్ధాలతో మన ముఖాన్ని చాలా తక్కువ ఖర్చుతో మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు.అందుకు మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార,ఒక స్పూన్ శనగపిండి ఇంకా ఒక స్పూన్ రాగి పిండి వేసి దానిలో కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖానికి బాగా పట్టించి వృత్తాకార మోషన్ లో బాగా మసాజ్ చేయాలి.అది బాగా ఆరాక ముఖాన్ని ఖచ్చితంగా చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే ముఖం మీద పెరుకుపోయిన దుమ్ము,ధూళి అంతా చాలా ఈజీగా తొలగిపోయి ముఖం బాగా కాంతివంతంగా మెరుస్తుంది.
ఇంకా అలాగే ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్, నల్లని మచ్చలు అన్నీ ఈజీగా తొలగిపోతాయి. కొంచెం సమయం కేటాయిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని బాగా మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు. పైగా ఈ టిప్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.అలాగే శనగపిండి మంచి టాన్ రిమూవల్ ఏజెంట్గా పనిచేస్తుంది. అలాగే చర్మం పై ఉన్న జిడ్డు కూడా ఈజీగా తొలగిపోతుంది.ఇంకా పంచదార అనేది మీ చర్మంపై ఉన్న మురికిని తొలగించి మంచి సహజ మెరుపును అందిస్తుంది. అలాగే రాగి పిండి కూడా మన ముఖం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.అలాగే చర్మం పై ఉన్న మృత కణాలు దుమ్ము, ధూళి అంతా కూడా ఈజీగా తొలగిపోతుంది. కాబట్టి ఈ టిప్ పాటించి మొటిమలు, నల్లని మచ్చలు లేకుండా తెల్లని కాంతివంతంగా ఉండే ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.