యవ్వనంలో ఉన్నారా మీ ముఖం సున్నితంగా లేదా ?
ఆరోగ్యకరమైన, అందమైన చర్మానికి మాయిశ్చరైజింగ్ అనేది చాలా అవసరం. కాబట్టి చర్మం పొడి బారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో ఎక్కువగా తిరగడం మంచిది కాదు. కాస్త టొమాటో జూస్ లో కొద్దిగా శనగ పిండి వేసుకుని ఆ పేస్ట్ ని ముఖానికి పట్టేలా సర్కిల్ షేప్ లో బాగా మసాజ్ చేసుకోవాలి. ఓ అరగంట ఆగి చల్లటి నీటితో కడుక్కోవాలి. సబ్బు వాడరాదు. ఇలా వారానికి మూడు నాలుగు సార్లు చేయొచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచి మెరిసేలా చేస్తుంది.
* నిత్యం చిరునవ్వు చిందిస్తే..మీ చర్మం మరింత ఆరోగ్య కరంగా మారుతుంది. ఇదేంటి అనుకుంటున్నారా...నవ్వడం వలన రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి మీ ముఖంపై ఉన్న చర్మానికి పోషకాలు, ఆక్సిజన్ అధికంగా లభించి ఆరోగ్యకరంగా చేస్తాయి. తద్వారా మీ ముఖం మెరుస్తూ ఎంతో యవ్వనంగా కనిపిస్తుంది.
* ప్రతి రోజు నిద్రపోయే ముందు కాస్త బియ్యపు పిండిని టొమాటోతో కలిపి అలా పూసుకొని ఇలా కడిగేయండి. ఇలా చేయడం వలన చర్మ రంధ్రాల్లో చేరిన మురికి పోయి చర్మ రంధ్రాలు బాగా గాలి అందుతుంది. దీని వలన మీ ముఖంలో గ్లో వస్తుంది. అంతేకాదు ఫ్రెష్ గా కనిపిస్తారు.