భారీ లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్స్...!
ఇక నేడు నిఫ్టీ 50 లాభనష్టాల విషయానికొస్తే... అత్యధికంగా లాభాల పడిన లిస్టులో మొదటగా బజాజ్ ఫైన్ సర్వ్, ఇందుస్ ల్యాండ్ బ్యాంక్, హెచ్ సిఎల్ టెక్, సిప్లా, భారతి ఎయిర్టెల్ కంపెనీల షేర్లు లాభపడిన లిస్టులో ముందుగా ఉన్నాయి. ఇక ఇందులో బజాజ్ ఫిన్ సర్వ్ ఏకంగా ఏడు శాతం మేర లాభపడింది. ఇక మరోవైపు అత్యధికంగా నష్టపోయిన షేర్ల విషయానికి వస్తే ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, డిపిసిఎల్, యుపిఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్ లో అత్యధికంగా నష్టపోయాయి. ఇందులో ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ 0.9 శాతం మేర నష్టపోయింది.
ఇక నగదు వివరాల్లోకి వస్తే.. నిన్నటి రోజున విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఏకంగా 1886 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా, దేశి ఇన్వెస్టర్స్ లు కేవలం 189 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. ఇక బంగారం విషయానికి వస్తే10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 500 రూపాయల మేరకు పెరిగి రూ. 52,370 కి చేరుకోగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయలు పెరిగి రూ. 48050 వద్ద ముగిసింది. ఇక కేజీ వెండి ధర రూ. 2300 రూపాయలు పెరిగి రూ. 59,300 కు చేరుకొంది.