కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ.. వాళ్లకు డ్యూటీ ఇవ్వండి?
10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేక వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్...ఈ 250 మందిని విధులోకి తీసుకుంటామని అసెంబ్లీలో హామీ ఇచ్చారని.. కానీ ఎందుకో వారిని విధులోకి తీసుకోవడంలో జాప్యం జరిగిందని ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. అందుకే మీ దృష్టికి మరోసారి మీకు గుర్తు చేస్తూ లేఖ రాస్తున్నానన్న ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.. ఈ 250మందిని వెంటనే విధులోకి తీసుకోవాలని కోరుతున్నానన్నారు.