శభాష్ మోదీ.. సరిహద్దు గ్రామాలకు గుడ్న్యూస్?
ఈ పథకం ద్వారా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని సరిహద్దు గ్రామాలకు లబ్ది చేకూరుతుంది. ఈ గ్రామాల్లో మౌలిక సదుపాయలతో పాటు జీవనోపాధి అవకాశాలు పెంచడమే ఈ పథకం ఉద్దేశమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెబుతున్నారు. అలాగే చైనాతో ఉన్న వాస్తవాధీనరేఖ వెంబడి సైన్యం బలోపేతం కోసం మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్కి కొత్తగా మరో ఏడు బెటాలియన్లు
మంజూరు చేసింది.